టెస్ట్ సిరీస్’కు ముందు ఆసీస్ కు షాక్

భారత్, ఆసీస్ ఇప్పటి వరకు చెరో మూడు మ్యాచ్ లు గెలిచాయి. 2-1 తేడాతో ఆసీస్ వన్డే సిరీస్ ని గెలుచుకోగా, 2-1తేడాతో టీమిండియా టీ20 సిరీస్ గెలిచేసింది. ఇక ఆధిపత్యం చూపించడానికి టెస్ట్ సిరీస్ మాత్రమే మిగిలి ఉంది. అయితే తొలి టెస్టుకు ముందు ఆసీస్ కు షాక్ తగిలింది.

తొడకండరాల గాయంతో భారత్‌తో ఆఖరి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ తొలి టెస్టుకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. డిసెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.