రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్

టీమిండియా వికెట్‌ కీపర్‌ పార్థివ్ పటేల్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై పలుకుతున్నట్లు ట్విట్ చేశాడు. 18 ఏళ్ల తన క్రికెట్‌ ప్రయాణాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలిపాడు. టీమిండియా తనపై విశ్వాసాన్ని ఉంచి 17 ఏళ్ల వయసులోనే అవకాశం కల్పించిందని అన్నాడు.

భారత్ తరఫున పార్థివ్‌ 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. శ్రీలంకతో 2012లో చివరి వన్డే ఆడాడు. మొదట్లో పార్థివ్ కు చాలా అవకాశాలే లభించాయి. అయితే వాటిని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక ధోని రాకతో పార్థివ్ పటేల్ అవసరం టీమిండియాకు లేకుండా పోయింది.