తెలంగాణ కరోనా రిపోర్ట్ : 643 కేసులు, 805 రికవరీ

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ కొత్త కేసుల నమోదులో స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 643 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,75,904కి చేరింది. 

నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,482కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 805 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,66,925కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.