ఏపీలో కొత్త కేసులు ఎన్నంటే ?

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 538 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,73,995కు చేరింది. నిన్న ఒక్కరోజే ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 7,047కి చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో 558 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,61,711 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,237 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.