ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ : టాప్-1కోహ్లీ, టాప్-1రోహిత్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదలయ్యాయ్. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ టాప్-1లో నిలిచారు. 870 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. రోహిత్‌ శర్మ (842) రెండో స్థానం దక్కించుకున్నాడు. మూడో స్థానంలోని బాబర్‌ ఆజామ్‌ కన్నా ఐదు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు.

ఇక ఆసీస్‌ సారథి ఆరోన్‌ ఫించ్‌ ఐదో ర్యాంకులో నిలిచాడు. 791 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నాడు. ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ 2018 తర్వాత తొలిసారి టాప్‌-20లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం 707 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నాడు. ఇక 194.18 స్ట్రైక్‌రేట్‌తో దుమ్మురేపి 167 పరుగులు చేసిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 20వ స్థానానికి ఎగబాకాడు.టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య తొలిసారి టాప్‌-50లోకి అడుగుపెట్టాడు.

బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా 700 పాయింట్లతో మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (722), అఫ్గాన్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (701) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమ్‌ఇండియా సిరీసులో ఏడు వికెట్లు తీసిన ఆడమ్‌ జంపా టాప్‌-20లో అడుగుపెట్టాడు. 14వ ర్యాంకు సాధించాడు. 6 వికెట్లు తీసిన జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఆరో ర్యాంకుకు ఎగబాకాడు.