సంగీత దర్శకుడు నరేంద్ర భిడే కన్నుమూత

మరాఠి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే (47) గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం ఉదయం పూణేలోని ఆయన నివాసంలో మృతి చెందాడాని.. నరేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు.

నరేంద్ర భిడే అనేక నాటకాలు, సీరియల్స్, సినిమాలు,  జింగిల్స్ ద్వారా సంగీత పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ‘ఏ పేయింగ్ గోస్ట్’ (2015) వంటి నాటకాల నుండి డియోల్ బ్యాండ్ (2015), బయోస్కోప్ (2015), ఉబూన్‌ టు (2017) పుష్పక్‌ విమాన్‌, హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారీ, పుల్లీ పాట్రన్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. భిడే మృతి పట్ల పలువురు సినీ ప్రముఖు సంతాపం తెలియజేశారు.