విరాట ప‌ర్వంలో పేతురాజు

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి-సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. అభ్యుద‌య భావాలు, న‌క్స‌లిజం.ప్రేమ వీటి మ‌ధ్య సాగే క‌థ ఇది. స్త్రీ శ‌క్తిని కూడా ద‌ర్శ‌కుడు బ‌లంగా చెప్పాల‌నుకుంటున్నాడు. అందుకే బ‌ల‌మైన స్త్రీ పాత్ర‌ల్ని రాసుకున్నాడ‌ట వేణు ఉడుగుల‌. ఆయా పాత్ర‌ల కోసం పేరున్న‌వాళ్ల‌నే ఎంచుకుంటున్నారు.

ప్రియ‌మ‌ణి, నందితాదాస్‌, జ‌రీనా వాహ‌బ్‌… ఇలా క‌థానాయిక‌ల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మ‌రో కీల‌క‌మైన పాత్ర కోసం నివేదా పేతురాజ్‌ని ఎంచుకున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. తాజా షెడ్యూల్ లోనే నివేదా సెట్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక ఇందులో సాయి పల్లవి, రానా నక్సలైట్స్ గా కనిపిస్తారని తెలుస్తోంది.