నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్న కేసీఆర్ 

గ్రేటర్ దెబ్బకు సీఎం కేసీఆర్ కు కళ్లు తెరచుకున్నట్టున్నాయ్. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చి రాగానే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టారు. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

వాస్తవానికి తెలంగాణ రాష్టంలో రైతులు సంతోషంగా ఉన్నారు. వృద్దులు, వికలాంగులు ఆనందంగా ఉన్నారు. ఎటొచ్చి విద్యార్థులు, ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. దాన్ని దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో చూపించారు ఈ నేపథ్యంలో వారిని త్వరలోనే సంతృప్తి పరిచేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు మొదలెట్టారు. ఢిల్లీ పర్యటన నుంచి రాగానే ఉద్యోగాల భర్తీపై అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు క్యూ కట్టనున్నాయి.