మరో నెలలో.. కరోనా ఫ్రీ తెలంగాణ !

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడొచ్చని చెబుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 1,496కి చేరింది.

నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. కరోనాబారి నుంచి నిన్న 631 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,69,232కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,380 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,298 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.