కరోనా ఎఫెక్ట్.. రూ. 99 కోట్లకి తగ్గిన అక్షయ్ రెమ్యూనరేషన్ !

కరోనా ఎఫెక్ట్ తో హీరోలు రెమ్యూనరేషన్ ని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకున్నాడు. కరోనా తర్వాత ఆయన రెమ్యూనేషన్ ని రూ. 99కోట్లకి కుదించారు. ఇది ఫేక్ అనుకునేరూ. ఇదీ నిజం. సాధారణంగా అక్షయ్ ఒక్కో సినిమా రూ. 110 నుంచి 120కోట్లు తీసుకుంటాడు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఆయన తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’కు రూ. 99 మాత్రమే తీసుకుంటున్నాడు.

అక్షయ్ ఓ వైపు సందేశాత్మక సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలు చేస్తుంటారు. ఆయన నటించిన కామెడీ ఎంటర్ టైన్ సినిమాలకి భారీ ఓపెనింగ్స్ ఉంటాయ్. అందుకే అక్షయ్ కు పారితోషికం రూ. 100కోట్ల పైమాటే. అయితే.. ఈ మ‌ధ్య‌నే వ‌చ్చ‌ని ‘ల‌క్ష్మీ బాంబ్’ మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. నాన్ థియేట‌ర్ రిలీజ్ లో కూడా ఈ సినిమా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.