దత్తన్నకు తప్పిన పెను ప్రమాదం

హిమాచల్ ప్రదేష్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్దారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రస్తుతం దత్తన్న హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళసైతో భేటీ అయ్యారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

ఈ ఉదయం దత్తాత్రేయ సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.  ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతోపాటు డ్రైవర్‌, ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ముగ్గురు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు వెళ్లిపోయారు.