శ్రీవారి సేవలో నిహారిక-చైతన్య

కొత్త జంట నిహారిక-చైతన్య ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిహారిక అత్త-మామలు, ఆమె తల్లి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ నెల9న ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న హైదరాబాద్ లో వివాహ విందునిచ్చారు. ఇక పెళ్లి పనులు పూర్తయిన తర్వాత కొత్తజంట దేవాలయాల చుట్టూ తిరుగుతోంది. ఇటీవలం అన్నవరం వెళ్లారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.