ఆ పాపం కేసీఆర్’కు తగులుతుంది

గో వధ మహా పాపం. ఆ పాపం సీఎం కేసీఆర్ కి కూడా తగులుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. సోమవారం తెల్లవారుజామున చౌటుప్పల్ చెక్ పోస్ట్ దగ్గర ఆవులను తరలిస్తున్న ట్రక్ ని రాజాసింగ్ పట్టుకున్నారు. ఆ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

ప్రతిరోజూ ఇదే విధంగా 50 వరకు ట్రక్కులలో ఆవులని తరలిస్తామని.. బాహుదూర్ పురా స్లాటర్ హౌస్ కి తీసుకెళ్లామని డ్రైవర్ చెప్పారని రాజా సింగ్ అన్నారు. గో వధ నిషేధం ఉన్న వీటిని ఎలా తరలిస్తుంన్నారు ? పోలీస్ లు, కమిషనర్ ఏమి చేస్తున్నారు ? అని ప్రశ్నించారు. ఆవులను చంపితే మహా పాపం. ఆ పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా తగులుతుందని రాజా సింగ్ అన్నారు.