హోస్ట్ గా తారక్.. ఓ సీక్రెట్ !

జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఓ షోకి యంగ్ టైగర్ ఎన్ టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఇందుకోసం ఏకంగా రూ. 18కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదీ నిజమే. కానీ.. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా మారనున్నాడని తెలిసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి తారక్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తెలుగు బిగ్ బాస్ ని తీసుకెళ్లి ఎక్కడో నిలబెట్టారు. దాన్ని కిందపడకుండా కాపాడటానికి నాని, నాగార్జున కష్టపడుతున్నారు. ఇప్పుడు.. జెమినీ టీవీ కూడా తారక్ హోస్ట్ గా వ్యవహరించనున్న షోపై భారీ ఆశలు పెట్టుకుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో తారక్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్‌లోనే తారక్ టాక్ షో చేస్తాడని సమాచారమ్.