భాగ్యలక్ష్మీ ఆలయంలో భాజాపా కార్పోరేటర్ల ప్రమాణం

తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మొక్కు తీర్చుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన భాజాపా కార్పోరేటర్లతో ప్రమాణం స్వీకారం చేయించారు. అమ్మవారి ముందు ఉంచి పూజలు చేసిన శాలువలతో కార్పోరేటర్లతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 48 మంది కార్పోరేటర్లతో ప్రమాణ చేయించారు.

అమ్మవారి సాక్షిగా ప్రజలకి సేవ చేస్తానని కార్పోరేటర్లు ప్రమాణం చేశారు. ఇలా అమ్మవారి ముందు ప్రమాణంతో భాజాపా కొత్త సాంప్రదాయానికి తెరతీసినట్టయింది. ఇక ఈరోజు శుక్రవారం కావడంతో.. పాత బస్తీలో హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయమే భాజాపా నేతలు పూజలు చేసుకొనేందుకు అనుమతులు ఇచ్చారు.