ఏపీలో 214 కొత్త కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,78,937కి చేరింది.  24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,078కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 422 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,992 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,01,105 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.