స్మార్ట్‌ గేమ్‌ ఆడిన సొహైల్‌

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలేలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. టాప్‌-5 నుంచి హారిక, అరియానా వెళ్లిపోయిన తర్వాత హౌస్‌లో మిగిలిన అభిజీత్‌, అఖిల్‌, సొహైల్‌కు నాగార్జున ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఎవరైతే స్వచ్ఛందంగా బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వస్తారో వారికి రూ.25 లక్షలు ఇస్తానని ప్రకటించారు. నాగార్జున ఇచ్చిన ఆఫర్‌కు సోహైల్‌ ఓకే చెప్పాడు.

అందులో రూ.5 లక్షలు మెహబూబ్‌కు, రూ.10 లక్షలను అనాథ శరణాలయానికి ఇస్తానని చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన మెహబూబ్‌ తనకిస్తానన్న రూ.5 లక్షలు కూడా అనాథ శరణాలయానికి ఇస్తానని ప్రకటించాడు. దీంతో నాగార్జున ఇంకో ఆఫర్‌ ఇచ్చాడు. అనాథ శరణాలయానికి రూ.10 లక్షలు తన సొంత డబ్బులు ఇస్తానని చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గత మూడు సీజన్ల ఫినాలేలో ఇలాంటి ఆపర్‌ ఇచ్చినా ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

సొహైల్ స్మార్ట్ గేమ్ తో విజేతగా నిలిచిన అభిజిత్ కి బొక్కపడింది. రూ. 50లక్షలు గెలుచుకోవాల్సిన అభిజిత్ అందులో సగం.. అంటే రూ. 25లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అభిజిత్ విన్నర్ అని ముందే లీకైంది. బహుశా.. ఆ లీకు సోహైల్ కి తెలిసిపోయి స్మార్ట్ గేమ్ ఆడినట్టున్నాడని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.