గుడ్ న్యూస్ : ఐపీఎల్’లో మరో రెండు జట్లకి ఆమోదం

ఐపీఎల్ అభిమానులకి గుడ్ న్యూస్. ఐపీఎల్ జట్ల సంఖ్య పెరగనుంది. రెండు కొత్త జట్లకు చేర్చడానికి బీసీసీఐ ఆమోదం తెలిపింది. అయితే వచ్చే సీజన్ (2021)కి మాత్రం కాదు. 2022 నుంచి పది జట్లతో ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించారు. 2021 సీజన్ నుంచే 10 జట్లతో ఐపీఎల్ జరపాలని కొందరు సభ్యులు ప్రతిపాదించినా.. ఇప్పుడు అంత సమయం లేదు. కాబట్టి 2022 నుంచి రెండు జట్లని చేర్చుకోవడానికి ఆమోదం తెలిపింది.

ఇక, క్రికెట్ ను 2028 ఒలింపిక్స్ లో కూడా చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి సూత్రప్రాయం గా మద్దతు పలకాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ఐపీఎల్ 13 సీజన్ విజేతగా ముంబై నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 14 సీజన్ కి మరో ఆర్నెళ్ల సమయం కూడా లేదు. ఈ కొద్దిసమయంలో రెండు కొత్త జట్ల ఏర్పాటు హడావుడి అవుతుందని 2022 నుంచి 10జట్లతో ఐపీఎల్ ని ప్లాన్ చేస్తున్నారు.