మహేష్ ఫ్యామిలీకి పవన్ క్రిస్మస్‌ గిఫ్ట్‌


జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన తోటలో పండిన మామిడి పండ్లని పలువురికి గిఫ్ట్ గా పంపిస్తుంటారు. ప్రతి యేడాది పవన్ మామిడి పండ్లని అందుకొని వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా  ఉన్నాడు. అయితే ఈ సారి పవన్ ఫ్యామిలీ నుంచి మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్ గిఫ్ట్ కూడా వెళ్లింది. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది. అంతేగాక పవన్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక దీపావళీకి మహేష్ ఫ్యామిలీ అందరికి గిఫ్ట్ లు పంపిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మూడ్నాలుగు సినిమాలని లైన్ లో పెట్టేశారు. ఇక మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్. బ్యాంక్ దోపిడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.