గిరిజనులతో వకీల్ సాబ్.. ముచ్చట్లు !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో గిరిజనులతో ఉల్లాసంగా గడిపారు. వకీల్‌సాబ్‌ షూటింగ్‌లో భాగంగా అరకు వెళ్లిన పవన్‌ విరామ సమయంలో ఆదివాసీలతో ముచ్చటించారు.

అడవి తల్లితో ముడిపడిన వారి స్థితిగతులను వివరిస్తూ గిరిజనులు పాడిన పాటను పవన్‌ కల్యాణ్‌ ఆస్వాదించారు. ఈ పాట వింటూంటే విభూతి భూషణ్‌ బందోపాధ్యాయ రచించిన ‘వనవాసి’ గుర్తుకు వస్తోందని పవన్ కల్యాణ్‌ ట్వీట్ చేశారు. గిరిజనులతో కలిసి పవన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.