UK నుంచి TS వచ్చిన 16 మందికి కరోనా

బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ వెలుగులోనికి వచ్చిన విషయం తెలిసిందే. ఇది పాత కరోనా వైరస్ కంటే 70శాతం వేగంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారిని గుర్తించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇటీవల యూకే నుంచి 1,200 మంది తెలంగాణకు వచ్చారు.

వీరిలో ఇప్పటికే 926 మందిని అధికారులు గుర్తించారు. వీరిలో16 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ 16 మంది బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించి 76 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.