తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రి పెద్దిరెడ్డిలతో తెలంగాణ మంత్రులు ఫోటోలకి పోజులిచ్చారు.

శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్‌, సుంకే రవిశంకర్‌, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.