మహేష్-రణ్‌వీర్.. ఓ మల్టీస్టారర్ !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. పై పిక్ చూస్తే కలిగే ఫీలింగ్ ఇదే. కానీ ఇది సినిమా స్టిల్ కాదు. యాడ్ స్టిల్. థమ్స్ అప్ యాడ్ ని తెలుగులో మహేష్ చేస్తుండగా.. హిందీలో రణ్ వీర్ సింగ్ చేస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ సందర్భంగా మహేష్-రణ్ వీర్ మాట్లాడుకుంటున్న స్టిల్ ఇది.

తాజాగా ఈ పిక్ ని షేర్ చేసిన మహేష్.. ‘మీతో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగించింది’ అని కామెంట్ పెట్టాడు. దీనిపై రణ్ వీర్ సింగ్ స్పందిస్తూ.. ‘నాకు పరిచయం అయిన వారిలో ఫైనెస్ట్ జెంటిల్‌మెన్ అయిన మహేష్‌ని కలవడం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. నా బిగ్ బ్రదర్ మహేష్‌పై నా ప్రేమ, గౌరవం ఎప్పుడు ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఇప్పటికే మహేష్ కు బాలీవుడ్ నుంచి చాలా ఆపర్లు వచ్చాయి. అయితే వాటిని మహేష్ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు. బాలీవుడ్ ఎంట్రీపై పలు ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్.. బాలీవుడ్ కి వెళ్లాలన్న ఆలోచనలేదు. తనకి తెలుగులోనే కఫర్ట్ గా ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.