‘ఆచార్య’ సెట్ లో రామ్ చరణ్


మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయిక. కరోనా లాక్‌డౌన్ తో ఆచార్య షూటింగ్ కి బ్రేకులుపడ్డాయి. అయితే తిరిగి ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ జరుపుకుంటోంది. తాజాగా ఆచార్య సెట్ లో రామ్ చరణ్ ప్రత్యక్షమయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయనది నక్సలైట్ పాత్ర. దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తారు. ఆయనకు జంటగా రష్మిక మందన నటించనున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చరణ్ తన పాత్ర షూటింగ్ కోసం ఆచార్య సెట్ కు రాలేదు. నిర్మాతగా షూటింగ్ పనులు పరిశీలిద్దామని వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఆచార్య సెట్స్ కి వస్తారా? లేక.. గ్యాప్ తీసుకొని వస్తారా ?? అన్నది తెలియాల్సి ఉంది.