బీజేపీలో చేరబోతున్న గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. ఆదివారం గంగూలీ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ధన్‌ఖర్‌తో సమావేశం అయ్యారు. దాదాపు గంటపాటు చర్చించారు. ఈ భేటీ తర్వాత గంగూలీ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది.

వాస్తవానికి గతంలోనే బీజేపీ నుంచి గంగూలీకి ఆహ్వానం వచ్చింది. కానీ దానిపై గంగూలీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంగూలీ బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం గంగూలీ గవర్నర్ ని కలిశారని చెప్పుకుంటున్నారు. మరీ.. దీనిపై గంగూలీ స్పందిస్తారా ? పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇస్తారా ? అన్నది చూడాలి.