మరో మెగా హీరోకు కరోనా పాజిటివ్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ‘తనకి కరోనా సోకింది. కానీ ఎలాంటి లక్షణాల్లేవ్. ప్రస్తుతం హోంక్వారంటైన్ లో ఉన్నా. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇటీవల తనని కలిసివారు కరోనా టెస్టులు చేయించుకోవాలని’ కోరుతూ ఈ ఉదయం రామ్ చరణ్ ట్విట్ చేశారు.

చరణ్ కి కరోనా సోకిన నేపథ్యంలో మిగితా మెగా హీరోల్లో టెన్షన్ మొదలైంది. వారికి కరోనా సోకి ఉంటుందని భావించారు. ఇప్పుడదనే నిజమైంది. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కి కరోనా పాజిటివ్ తేలింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా తేజుట్విట్ చేశారు. “ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. త్వరలోనే తిరిగి వస్తా. మీ ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ట్విట్ చేశారు.

ఈ నెలలో మెగా పెళ్లి సందడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న ఉదయ్ పూర్ లో నిహారిక-చైతన్య జొన్నలగడ్డ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేసింది. ప్రీ వెడ్దింగ్ సెలబ్రేషన్స్ లో, పెళ్లి వేడుక, పెళ్లి విందు.. ఇలా మెగా ఫ్యామిలీ పాల్గొంది. సందడి చేసింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్ గా తేలడంతో మిగితా హీరోలకి సోకి ఉంటుందని భావించారు. ఇప్పుడు అదే నిజం అవుతోంది.