ఉపాసనకు కరోనా నెగటివ్.. కానీ !


మెగా హీరోలు ఒక్కోక్కరుగా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ కాగా.. సాయంత్రం మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో కరోనా కలవరం మొదలైంది. మెగా హీరోలందరూ.. మెగా ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్  వస్తుందని భావించారు. ఎందుకంటే ? ఇటీవల జరిగిన నిహారిక పెళ్లిలో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేసింది.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరు ఇప్పుడు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. తాజాగా మెగా కోడలు నిహారికకు కరోనా నెగటివ్ వచ్చింది. దీనిపై ఆమె స్పందించారు. ‘చరణ్‌కు పాజిటివ్‌ వచ్చిన తర్వాత తాను కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నా. నెగెటివ్‌ వచ్చింది. కానీ, తనకు మళ్లీ పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నా. వేడి నీరు, ఆవిరి పట్టడం విశ్రాంతి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా’నని ఉపాసన ట్విట్ చేశారు.