అలర్ట్ : ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు

గడువులోపు ఐటీ రిటర్నులు దాఖలు చేయకుంటే.. ఐటీ దాడులు తప్పవ్. ఐటీ రిటర్నులలో తేడాలున్నా.. ఐటీ ఎటాక్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం పొడిగించింది.

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజులు గడువిచ్చింది. జనవరి 10 వరకు రిటర్నులు దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. అలాగే కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలుకు 15 రోజులు గడువు పెంచింది. ఫిబ్రవరి 15లోపు రిటర్నులు దాఖలు చేసుకునే వీలు కల్పించింది.