న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్.. హైదరాబాద్’లో ఆంక్షలు !

న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. వారి ఉత్సాహాన్ని తెలంగాణ ప్రభుత్వం డబుల్ చేసింది. రేపు మద్యం షాపులకి అర్థరాత్రి 12గంటల వరకు, బార్లు, క్లబ్ లకి రాత్రి 1గంట వరకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పీక్స్ చేరనున్నాయి.

మరోవైపు న్యూఇయర్ సెలబ్రేషన్స్ ని  దృష్ట్యాలో పెట్టుకొని హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు అమలవుతాయని అధికారవర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయం ప్రకటించింది.

సైబర్‌ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్‌ స్పేస్‌ ఫ్లై ఓవర్స్‌, దుర్గం చెరువు తీగల వంతెన మూసివేస్తున్నట్లు తెలిపింది. ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. మరోవైపు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, నెక్టెస్‌ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.