ఎండింగ్.. స్టార్టింగ్ కూడా ప్రభాస్ తోనే !

ఏం చేసినా బోణి బాగుండాలి. 2020లో హీరోయిన్ పూజా హెగ్డేకి మంచి బోణి తగిలింది. ‘అలా.. వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది. ఇక 2021లోనూ మంచి బోణి కోరుకుంటోంది బుట్టబొమ్మ. ఈ సారి ప్రభాస్ తో బోణి చేయించుకుంటుందట. ప్రస్తుతం పూజా ‘రాధేశ్యామ్’తో బిజీగా ఉంది. మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. ఈ యేడాది చివరల్లో పూజా రొమాన్స్ చేసింది ప్రభాస్ తోనే. వచ్చే యేడాది బోణి కూడా ప్రభాస్ తోనే.

అంతేకాదు.. వచ్చే యేడాది హిట్ బోణి కూడా ప్రభాస్ తోనే కొట్టించుకోవాలని ఆశపడుతుంది. రాధేశ్యామ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటోంది. వచ్చే యేడాది ప్రథమార్థంలోనే రాధేశ్యామ్ రానుంది. అందుకే పూజా హిట్ బోణి కోరుకుంటోంది. పూజా నటిస్తున్న మరో సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. కానీ అఖిల్ పై ఆమెకి అంతగా ఆశల్లేవట. ఆమె ఫోకస్ అంతా ప్రభాస్ మీదనే పడిందని.. ఆయనతో 2021లో బోణి చేయించుకోవాలని చూస్తుందట. మరీ.. పూజా కోరిక తీరుతుందేమో చూడాలి.