సీక్రెట్ : రణ్‌బీర్-అలియా ఎంగేజ్ మెంట్.. ఈరోజే !


బాలీవుడ్ ప్రేమజంట రణ్ బీర్ కపూర్-అలియా భట్ అభిమానులకు సడెన్ సప్రైజ్ ఇవ్వబోతుంది. ఈ ప్రేమజంట సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకోబోతుంది. వేదిక జైపూర్. ముహూర్తం ఈరోజే. ఈ రోజు రాత్రి జైపూర్ లోని ఓ హోటల్ లో రణ్ బీర్-అలియాల నిశ్చితార్థ వేడుక జరగనుందని సమాచారమ్. ఇప్పటికే ఇరువర్గాల కుటుంబ సభ్యులు, కొందరు బాలీవుడ్ ప్రముఖులు జైపూర్ చేరుకున్నారు.

మంగళవారం ఉదయం రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌, నీతూ సింగ్‌లు జైపూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొనే కూడా జైపూర్‌కి వెళ్లారు. వారి తరువాత బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా జైపూర్ పయనమయ్యాడు. వీరందరూ ఇప్పటికే ఓ హోటల్‌లో ఉండగా.. వారి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీరంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అక్కడికి వెళ్లారని అనుకున్నారు. కానీ ఇవాళ రణ్‌బీర్- అలియా ఎంగేజ్‌మెంట్ జరగనుందని.. అందుకోసమే వారంతా అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.