‘పుష్ప’ ఐటమ్’గా పటానీ ఫిక్స్ !


అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. సుకుమార్ సినిమా అంటే.. అదిరిపోయే ఐటం సాంగ్ పక్కా. పుష్పలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉండనుంది. ఇందులో చిందేయడానికి బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీని సంప్రదించారు. ఆమె ఓకే చెప్పింది. కానీ రూ. 1.5కోట్ల పారితోషికం అడిగినట్టు వార్తలొచ్చాయ్. దీంతో పటానీకి సుకుమార్ ఓకే చెబుతారా ? లేదంతో మరో గ్లామర్ బ్యూటీ కోసం వెతుకుతాడా ? అన్నది చర్చనీయాంశం అయింది.

లెటెస్ట్ న్యూస్ ఎంటంటే ? దిశా పటానీకి ఓకే చెప్పేశారు. ఆమె అడిగిన రూ. 1.5 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దిశా పటానీని తీసుకుంటే.. బాలీవుడ్ లో బిజినెస్ పెరుగుతుందనే ప్లాన్ లో ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారు. పటానీ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలిసిన ఫేస్. లోఫర్ సినిమాలో నటించింది. ధోని బయోపిక్ తో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఇక పటానీ హాట్ హాట్ ఫోటోల కోసమే ఎదురు చూసే ప్రత్యేక అభిమాన గణం ఉంది. ఈ నేపథ్యంలో సుకుమార్ తన ఐటమ్ గర్ల్ గా పటానీని ఫిక్స్ చేశారని తెలుస్తోంది.