తారక్-త్రివిక్రమ్ సినిమా.. ఓ గుడ్ న్యూస్ !


యంగ్ టైగర్ ఎన్ టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన సినిమా ఉండనుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తారక్-త్రివిక్రమ్ కలిశారు. సినిమా గురించి చర్చలు జరిపారు. తాజాగా ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు బయటికొచ్చాయ్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తారక్-త్రివిక్రమ్ కోసం ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? మిగితా నటీనటుల వివరాలు ఏంటీ ? అన్నది త్వరలోనే తెలియనున్నాయి. బహుశా.. సంక్రాంతి తర్వాత తారక్-త్రివిక్రమ్ సినిమా అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. న్యూఇయర్ సందర్భంగా శనివారం త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ ని కలిశారు. ఇక ఈరోజు త్రివిక్రమ్ తారక్ ని కలవడం విశేషం.