TSలో 394 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పలువురిలో కొత్తరకం కరోనా వైరస్ ని గుర్తించారు. ఈ ఎఫెక్ట్ తో తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే అలా జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తపడుతోంది.

ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 394 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,87,502కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,549కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 574 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,80,565కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,388 ఉండగా వీరిలో 3,210 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.