ఏపీలో రికార్డ్ స్థాయిలో పడిపోయిన కరోనా కేసులు

ఒకప్పుడు ఏపీలో రికార్డ్ స్థాయిలోకరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ 10వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయ్. ఇప్పుడీ.. ఈ కేసులు క్రమంగా తగ్గుతూ..వందకి చేరువయ్యాయ్. గడిచిన 24 గంటల్లో ఏపీలో 128 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయ్. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య  8,83,210కి చేరింది. ఇక ఇప్పటి వరకు 8,73,149 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,943 మందికి చికిత్స కొనసాగుతోంది.

గడిచిన 24 గంటల్లో ఎపీలో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,118కి చేరింది. ఇక కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో  అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. తూర్పు గోదావరిలో 19, కృష్ణా జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.