గుడ్ న్యూస్.. సౌరవ్ గంగూలీ కోలుకుంటున్నారు !

ఛాతీ నొప్పితో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కోల్ కతా లోని ఉడ్ ల్యాండ్ ఆసుపత్రిలో గంగూలీ చికిత్స పొందుతున్నారు. ప్రసుత్తం ఐసీయూలోనే ఉన్నారు. అయితే గంగూలీ కోలుకుంటున్నారు. బుధవారం విడుదల చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తొమ్మిది మంది డాక్టర్లతో కూడిన బృందం ఈ రోజు గంగూలీ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు.

గంగూలీ ఆసుపత్రిలో చేరిన తర్వాత గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో మూడు చోట్ల అడ్డంకులను గుర్తించాం. యాంజియోప్లాస్టీ నిర్వహించి ఓ దాన్ని తొలగించాం. ఎల్ఏడీ, ఓఎం2లకు మాత్రం రెండో దశలో యాంజియోప్లాస్టీ నిర్వహించాలని నిర్ణయించాం. అయితే గంగూలీకి మళ్లీ ఛాతీ నొప్పి రాకపోవడంతో తర్వాతి యాంజియోప్లాస్టీని వాయిదా వేశాం. మరో రెండు వారాల తర్వాత రెండో యాంజియోప్లాస్టీని నిర్వహిస్తాం. గంగూలీ క్రమంగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన్ని డిశ్ఛార్జ్ చేసే ఛాన్స్ ఉందని తెలిపారు. గంగూలీ కోలుకుంటున్నారన్న న్యూస్ విని ఆయన అభిమానులని ఆనందపడుతున్నారు.