ఒక్కొక్కడికి తాట తీస్తా.. నాని వార్నింగ్ ! 

ఏపీ మంత్రి కొడాలి నాని దూకుడు గురించి తెలిసిందే. ఏకంగా ప్రధానిపైనే పంచులేసిన ధైర్యం ఆయనది. ఇక ఆయన్ని ఎవరైనా గెలికితే ఊరుకుంటారా !? సినిమాలో బాలయ్య మాదిరిగా తొడగొట్టరు. ఇప్పుడు మంత్రి కొడాలి నాని అదే చేశారు. ఒక్కొక్కడికి తాట తీస్తా అంటూ టీడీపీ నేతలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే ?

మంత్రి కొడాలి నాని అడ్డాలో పేకాట దందా నడుస్తోందంటూ ఒక పత్రికలో కథనం వచ్చింది. ఈ దందా వెనక మంత్రి నాని బావమరిది ఉన్నారని పేర్కొన్నారు. ఈ కథనం ప్రచురితం అయిన రోజునే.. కొడాలి నాని సీఎం జగన్ ని కలిశారు. దీంతో.. పత్రిలో వచ్చిన కథనం నిజమే. దీనిపై సీఎంకు వివరణ ఇచ్చేందుకే నాని వచ్చారనే ప్రచారం మొదలైంది. దీనిపై నాని ఘూటుగా స్పందించారు.

సీఎం జగన్ ని కలిసిన తర్వాత మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తానంటూ తెదేపా నేతలని హెచ్చరించారు. తానే పేకాట దందా నడిపిస్తే.. పోలీసులు ఎందుకు దాడులు చేస్తారు. అసలు దాడులు చేయమన్నదే మా ప్రభుత్వం అన్నారు. అసలు పేకాట ఆడేవారికి కూడా పార్టీలు ఉంటాయా ? తెదేపా, వైసీపీ, జనసేన, బీజేపీ అంటూ పేకాట ఆడతారా ? అని విస్మయం వ్యక్తం చేసారు. మొత్తానికి.. పేకాట దందా కథనం మంత్రి కొడాలి నానిని తీవ్రంగా డిస్ట్రబ్ చేసింది అన్నది మాత్రం నిజం.