చంద్రబాబుపై కేసు నమోదు.. అరెస్ట్ చేస్తారా ?

విజయనగరంలో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహ శిరస్సును కొందరు దుండగులు ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ భాజపాతో పాటు రామభక్తులు అక్కడ నిరసనలు చేపట్టారు. ఈనేపథ్యంలో రామతీర్థాన్ని పరిశీలించేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు.

ఇంతలోనే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రానికి వెళ్లారు. అయితే విజయసాయి రెడ్డి కొండపై సంఘటన స్థలాన్ని పరిశీలించి కిందకు దిగి వస్తుండగా, ఆయన వాహనంపై కొందరు రాళ్లు, చెప్పులు, మంచినీళ్ల పొట్లాలు విసిరారు.  రాజకీయ ఉద్దేశ్యంతో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపిస్తూ చంద్రబాబు, పాటు తెదేపా నేతలు కళావెంకట్రావు, అచ్చెన్నాయుడుపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకి కారణం ప్రభుత్వమేనని తెదేపా, భాజాపా, జనసేనలు ఆరోపిస్తున్నసంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ దాడుల వెనక తెదేపా హస్తం ఉందని ఆరోపిస్తోంది. త్వరలోనే దానిని నిరూపిస్తాం. నిందితులని అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. మొత్తానికి.. హిందూ దేవాలయాలపై దాడులు ఏపీ రాజకీయాలని హీటెకిస్తున్నారు. ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్థం వెళ్లనున్నారు.