వైరల్ పిక్’పై మెగా కామెంట్

తెలుగు రాష్ట్రాల్లో ఓ పిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన కంటే పెద్ద హోదాలో ఉన్న కూతురికి తండ్రి సెల్యూట్ చేసిన పిక్ అది.  ఏపీ తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విభజన తరువాత ఏపీ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” అని పేరు పెట్టారు. ఈ క్రమంలో గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్న కూతురు జెస్సీ ప్రశాంతికి తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్న శ్యామ్ సుందర్ సెల్యూట్ చాలా అరుదైన ఘటనగా నిలిచింది. 2018 బ్యాచ్ కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. 

ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు జెస్సీ ప్రశాంతి. ఆమె తండ్రి శ్యామ్ సుందర్ తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటీలో ఉన్న తన కూతురు ప్రశాంతి దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు శ్యామ్. ఆ కూతురు కూడా వెంటనే సెల్యూట్ చేసి ‘ఏంటి నాన్నా?’ అంటూ తాను డ్యూటీలో ఉన్నాననే విషయం కూడా మరచిపోయి గట్టిగా నవ్వేశారు ప్రశాంతి. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా ఈ వైరల్ పిక్ పై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఈ ఫోటోలో ఉంది తండ్రి-కూతురు తండ్రి గారు కూతురు తన గుండెలమీద ఎత్తుకుని పెంచిన బిడ్డ,తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తి ని,గర్వాన్ని,ప్రేమని చూసాను” అని రాసుచొచ్చారు.