తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఇటీవల తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రతిరోజూ 200పైగా మాత్రమే నమోదవుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 417 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,88,410కి చేరింది.

నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,556కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 472 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,81,872కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,982యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 2,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కొత్త రకం కరోనా కేసులు 30 నమోదు కాగా.. ఇందులో తెలంగాణకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు.