అల.. సంగీత కచేరి’కి యేడాది

2020లో సినీ తీపి గుర్తులు చాలా తక్కువ. ఒకట్రెండు మాత్రమే ఉన్నాయి. వీటిలో అల.. వైకుంఠపురంలో ఒకటి. గత యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అల.. వైకుంఠపురంలో ప్రేక్షకులని అలరించింది. ముఖ్యంగా ఇందులోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. ఖండాలు దాటి ఇతర దేశాల ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. నేటికి సరిగ్గా ఏడాది క్రితం అంటే.. 2020 జనవరి 6న ‘ఏవీపీఎల్‌ మ్యూజికల్‌ కన్సర్ట్(సంగీత కచేరి)’ పేరుతో ఆ సినిమా పాటలను విడుదల చేశారు.

అలా విడుదలైన పాటలు ఎంతలా సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే.. ఆ సంగీత కచేరీకి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం మరోసారి ఆ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఆడియోలాంచ్‌కు సంబంధించిన వీడియోను చిత్రబృందం 7.49నిమిషాలకు కుదించి అభిమానులతో పంచుకుంది. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. అల్లు అన్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లు. తమన్‌ సంగీతం అందించారు.