TSలో 379 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 379 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,88,789కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,553కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 305 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,82,177కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,053 ఉండగా వీరిలో 2,776 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ స్టెయిన్ కేసులో మన దేశంలో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 70 వరకు కొత్త రకం కరోనా కేసులు నమోదైనట్టు సమాచారమ్. తెలంగాణలో కొత్తరకం కరోనా కేసులు మూడు నమోదయ్యాయ్. కరోనా తగ్గుముఖం పట్టిందని అలసత్వం వహిస్తే.. తిరిగి విజృంభించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.