హాస్పటల్’లో సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ హాస్పటల్ కి వెళ్లడంతో ఆయన అభిమానులు, తెరాస శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. అయితే భయపడాల్సిందేమీ లేదు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సీఎం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రేపు వెల్లడించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్‌ తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ తదితరులు బుధవారం సీఎంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో వాటి నిమిత్తమై సీఎం కేసీఆర్ ఈరోజు యశోదకు వెళ్లారు. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత సమస్య ఏంటన్నది తెలియనుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం సీఎం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. సమస్య ఏమీలేదని తెలుస్తోంది.