ఫ్యామిలీకి గోపీచంద్ న్యాయం చేయగలడా ?

దర్శకుడు మారుతి మొదట్లో బూతు సినిమాలు తీశాడు. బూతు డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే భలే భలే మగాడివోయ్ తో బూతు ముద్రని చెరిపేసుకున్నాడు. ఫ్యామిలీ దర్శకుడిగా మారిపోయాడు. ఈ క్రమంలో కాన్సెప్ట్ బేసిడ్ సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ప్రతిరోజూ పండగే తర్వాత ఓ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథని రాసుకున్నారు. దానికి రవితేజని హీరోగా అనుకున్నారు. కానీ, రెమ్యూనరేషన్ విషయంలో రాజీపడని రవితేజ నో చెప్పేశారు. దీంతో ఈ కథ గోపీచంద్ దగ్గరకు వచ్చింది.

గోపీచంద్ మాస్ కథలకు ఫర్ ఫెక్ట్. కాన్సెప్ట్ కథలకి న్యాయం చేయగలడు. కానీ ఆయన ఫ్యామిలీ ప్రేక్షకులని ఏ మేరకు న్యాయం చేయగలడు. మారుతి రాసుకున్న ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ కథకు సూటవుతాడన్నది అనుమానంగా మారింది. ఈ సినిమా కోసం ‘పక్కా కమర్షియల్’ టైటిల్ అనుకుంటున్నారట. అంటే.. యాక్షన్ తో పాటు కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయి. ఈ కథకి గోపీ న్యాయం చేస్తే.. ఇకపై ఆయన కూడా ఫ్యామిలీ హీరో జాబితాలో చేరిపోవచ్చు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలున్నాయి.