గోపీచంద్’తో మారుతి సినిమా ఫిక్స్

‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో హిట్ కొట్టారు మారుతి. ఈ సినిమా తర్వాత యేడాది ఖాళీగానే ఉన్నారు. దీనిపై రకరకాల ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఓ కమర్షియల్ కథని రాసుకొని మాస్ మహారాజ రవితేజని వినిపించారు. ఆయన ఓకే చేసేశారు. కానీ పారితోషికం తగ్గర పేచీ వచ్చిపడింది. రవితేజ రూ. 12కోట్లు కావాలని కూర్చుకున్నాడు. నిర్మాతలు 8-9కోట్ల వరకు బేరం ఆడారు. నో చెప్పేసిన రవితేజ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ కథతో గోపీచంద్ వద్దకు వెళ్లింది. తాజాగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది.  యూవీ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేస్తూ.. ఇందుకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని విడుద‌ల చేశారు. ఈ వీడియోకి.. ప్ర‌ముఖ న‌టుడు రావు ర‌మేష్ వాయిస్ అందించారు. త‌న సినిమా పై వ‌చ్చిన ర‌క‌ర‌కాల పుకార్ల నేప‌థ్యాన్ని జోడిస్తూ.. “ర‌క‌ర‌కాల వార్త‌ల‌తో తాను తీయ‌బోని సినిమాని మారుతితో తీయించేశార‌ని కోర్టువారు న‌మ్మ‌డం జ‌రిగింది..“ అంటూ మారుతి సినిమాని ఖ‌రారు చేసేశారు. ఫ‌స్ట్ లుక్ తో పాటు, టైటిల్ నీ ఒకే సారి విడుద‌ల చేయ‌బోతున్నాడు. బ‌హుశా.. సంక్రాంతికి రిలీజ్ చేస్తారేమో.. !ఇక ఈ సినిమా కోసం ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.