బోయినపల్లి కిడ్నాప్ కేసు.. షాకింగ్ నిజాలు !

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి భూ వ్యవహారం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారమ్. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ(ఏ1), ఏవీ సుబ్బారెడ్డి (ఏ2)లని అరెస్ట్ చేశారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ (ఏ3) పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఈ కేసు ఇవాళ్టీది కాదు. దాదాపు 15యేళ్లుగా నానుతున్న కేసు అని తెలిసింది.  గతంలో హాఫీజ్‌పేట్ భూముల్ని భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి కలిసి దక్కించుకున్నారు.భూమా నాగిరెడ్డి మరణం తర్వాత సుబ్బారెడ్డి ఈ వ్యవహారాన్ని డీల్ చేశారు. అయితే 50 ఎకరాల భూమి ఎవరికి సంబంధించింది.. ఎంత మంది భాగస్వాములు ఉన్నారు. ఎన్నాళ్ల క్రితం ఈ భూమి కొనుగోలు చేశారు. ఎవరి పేరుతో డాక్యుమెంట్స్ ఉన్నాయి అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

పోలీసులు కూడా నిందితులని అరెస్ట్ చేశారు. కానీ ఈ భూ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇంకా తెలియజేయలేదు. ముగ్గురు నిందుతులని విచారించిన తర్వాత.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయ్. అదే సమయంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.