లూసిఫర్2 రెడీ అవుతోంది

‘లూసిఫర్‌’ను తెలుగులో చిరంజీవి రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్‌. ఒకవైపు తెలుగులో మొదటి భాగం రీమేక్ అవుతుంటే మలయాళంలో సీక్వెల్‌ను మొదలు పెట్టే పనిలో ఉండటం విశేషం. మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

దీనికి కొనసాగింపు చిత్రం ఉంటుందని క్లైమాక్స్‌లో చెప్పేశారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కరోనా కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం సీక్వెల్‌ చర్చలు మొదలైనట్లు సమాచారం. రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను మోహన్‌లాల్‌కు పృథ్వీరాజ్‌ వివరించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారుని సమాచారమ్. లూసిఫర్ 2 కూడా హిట్టైతే.. తెలుగులోనూ దాన్ని రిమేక్ చేసే అవకాశాలున్నాయి.