కొత్త చైతన్య కనిపిస్తాడట


శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది. సంక్రాంతి కానుకగా ఆదివారం విడుదల చేసిన లవ్ స్టోరి టీజర్ కు మంచి స్పందన వస్తోంది. దీనిపై దర్శకుడు శేఖర్ కమ్ముల సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకి కృతజ్ఝతలు తెలిపారు. కమ్ముల ఇంకా ఏమన్నారంటే ?

“చిన్న ఊరు నుంచి పట్టణానికి వచ్చి బాగా స్థిరపడదామని అనుకున్న ఓ యువకుడి ప్రయత్నమే ఈ సినిమా. సినిమాలో హీరో పాత్ర నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. దాన్ని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. డైలాగ్స్‌, నటన.. ఇలా అన్ని విషయాల్లోనూ చైతన్య చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో మీరు కొత్త చైతన్యను చూస్తారు”అని చెప్పుకొచ్చారు.

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు నారాయణదాస్‌, రామ్‌మోహన్‌రావు నిర్మాతలు. పవన్‌ సంగీతం అందించారు. దేవయాని, రావురమేశ్‌, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేశ్‌, తాగుబోతు రమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.