ఇదో లవ్ ఎఫైర్ : త్రివిక్రమ్

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. పూజా హెగ్డే కథానాయిక. గత యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోని పాటలు అయితే ఖండాంతరాలు దాటిపోయాయ్. ఈ సినిమా రిలీజై యేడాది పూర్తయిన సందర్భంగా #Alavaikunthapuramulo రీయూనియన్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్.. మరోసారి ప్రేక్షకులకి కృతజ్జతలు చెప్పారు. ఇక చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికి పేరుపేరున థ్యాంక్స్ చెప్పారు.

ఇదో లవ్ స్టోరీ. అమ్మాయిని కలిసినప్పుడు ఏం జరుగుతుందో.. అల.. విషయంలోనూ అదే జరిగిందంటూ… సినిమాకు సంబంధించిన తీపి జ్ఝాపకాలని త్రివిక్రమ్ వివరించారు. బన్నీతో మొదటి సిట్టింగ్ నుంచి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ సీన్ తీసేయమని బాబీ చెప్పిన విషయాలని త్రివిక్రమ్ ప్రేక్షకులతో పంచుకున్నారు. మధ్యలో స్నేహితుడు సునీల్ పై ప్రేమని కురిపించాడు. సునీల్ నా పక్కన ఉంటే చాలు. అతడు ఏం చేయకపోయినా పర్వాలేదు. అందుకే ఈ సినిమాలో తీసుకున్నారు. వాడు నవ్వితే చాలన్నారు.