కరోనా వాక్సీన్.. తెలుగు రాష్ట్రాలకు 7.59లక్షల డోసులు !

కరోనా వాక్సీన్ తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకు 7.59లక్షల డోసులు వస్తున్నాయి. మరికాసేపట్లో పుణె నుంచి ప్రత్యేక కార్గో విమానంలో 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు కాసేపట్లో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నాయి. అక్కడి నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులు తరలించనున్నారు.

ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. తొలిరోజు 139కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్‌ టీకా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు 3.87లక్షల డోసులు రానున్నాయి. పుణె నుంచి మరికాసేపట్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరనున్నాయి. ప్రత్యేక బందోబస్తుతో గవర్నరంలోని రాష్ట్ర వ్యాధినిరోధక భవనానికి తరలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిదశలో భాగంగా 3.87 లక్షల మందికి కొవిషీల్డ్‌ టీకా అందించనున్నారు.